హైదరాబాద్ సభకు తరలిన బీఆర్ఎస్ నేతలు

Published on

-Advertisement-

హైదరాబాద్ సభకు తరలిన బీఆర్ఎస్ నేతలు

మన భారత్, ఆదిలాబాద్:
తాంసి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, నూతన ప్రజాప్రతినిధులు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కీలక సభకు భారీగా తరలివెళ్లారు. మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కే. తారక రామారావు) నేతృత్వంలో జరిగిన ఈ సభకు హాజరయ్యేందుకు మండల నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు.

ఈ సందర్భంగా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను కేటీఆర్ ప్రత్యేకంగా ఘనంగా సత్కరించారు. పార్టీకి ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని గుర్తుచేస్తూ, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై చురుకుగా స్పందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలు కార్యకర్తల కష్ట ఫలితమని పేర్కొన్న కేటీఆర్, రానున్న రోజుల్లో కూడా అదే ఉత్సాహంతో ప్రజల మధ్య ఉంటూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ ఐక్యతను కాపాడుకుంటూ గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ బలాన్ని మరింత పెంచుకోవాలని నాయకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు, మాజీ ఎంపీటీసీ అశోక్, సర్పంచులు ఈరగొల్ల అశోక్, నాయకులు వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేశారు.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...