మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ సేవాభావం..

Published on

-Advertisement-

ఆసీంపూర్–కేర్గామాలో చలి దుప్పట్ల పంపిణీ

– మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ సేవాభావం

మన భారత్, ఆదిలాబాద్:

ఆసీంపూర్–కేర్గామా గ్రామంలో చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో చలి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని నిరుపేదలు, వృద్ధులు చలితో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సేవాభావంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షులు తోట శివన్న, ప్రధాన కార్యదర్శి బొల్లు ఈశ్వర్ దాస్, సభ్యులు వద్ది రవికాంత్ పాల్గొన్నారు. అలాగే కేర్గామా గ్రామ మున్నూరు కాపు మాజీ అధ్యక్షులు గాజుల సంజీవ్, ప్రధాన కార్యదర్శి పూచంశెట్టి దేవన్న కూడా కార్యక్రమానికి హాజరై దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చలి కాలంలో పేద ప్రజలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

గ్రామస్థులు మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ సభ్యుల సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Latest articles

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...

ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ

మన భారత్, బీంపూర్: భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ప్రహరీ గోడ నిర్మాణానికి శుభారంభం...

More like this

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...