బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు బీజేపీలో చేరిక..

Published on

-Advertisement-

 బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ – బీజేపీలో చేరిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోదరుడు జ్ఞానేశ్వర్

మన భారత్, ఆదిలాబాద్:
అదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బోథ్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్ గారి సోదరుడు జాదవ్ జ్ఞానేశ్వర్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీకి మరో పెద్ద షాక్ తగిలినట్లయింది.

అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ గారు జాదవ్ జ్ఞానేశ్వర్‌కు పార్టీ కండువా కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ అమలు చేస్తున్న ప్రజాపక్ష పాలన కార్యక్రమాలు నచ్చి జ్ఞానేశ్వర్ బీజేపీలో చేరడం హర్షణీయమన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు ముగ్గురు సోదరులు ఉండగా, అందులో ఒకరైన జాదవ్ జ్ఞానేశ్వర్ బీజేపీ గూటికి చేరడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికతో ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బలపడనుందని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ మార్పు ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలన్న లక్ష్యంతోనే బీజేపీలో చేరినట్లు జ్ఞానేశ్వర్ తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Latest articles

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...

ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ

మన భారత్, బీంపూర్: భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ప్రహరీ గోడ నిర్మాణానికి శుభారంభం...

More like this

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...