విశ్వ వాణి ప్రార్థన మందిరంలో ఘనంగా క్రిస్మస్..

Published on

-Advertisement-

తలమడుగులో విశ్వవాణి ప్రార్థన మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు గ్రామంలోని విశ్వవాణి ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తును మనసారా ఆరాధించి, ఆయన జన్మదినాన్ని ఆనందోత్సాహాలతో ఘనపరిచారు. ప్రార్థనలు, గీతాలు, సందేశాలతో మందిరం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.ఈ సందర్భంగా పాస్టర్ సామ్యూల్ గోదారి ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రేమ, శాంతి, సేవా భావనలే క్రీస్తు బోధల సారమని పేర్కొన్నారు. సంగపెద్ద రాంపాల్ మునుగోటి సంఘ సభ్యులు, సంఘ పెద్దలు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

గ్రామ సర్పంచ్ ఎలుగు రాజన్న (చంటి) కూడా కార్యక్రమానికి హాజరై క్రైస్తవ సోదరులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాల మధ్య సౌహార్దం, పరస్పర గౌరవంతో గ్రామం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం సర్పంచును శాలువాలతో ఘనంగా సత్కరించారు.

క్రిస్మస్ సందర్భంగా చిన్నారులు, యువత ప్రత్యేక గీతాలు ఆలపించగా, సంఘ సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకలు గ్రామంలో ఐక్యతను, సామరస్యాన్ని మరింత బలపరిచాయని పాల్గొన్నవారు తెలిపారు.

Latest articles

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...

ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ

మన భారత్, బీంపూర్: భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ప్రహరీ గోడ నిర్మాణానికి శుభారంభం...

More like this

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...