భక్తి శ్రద్ధలతో సిల్వర్ జూబ్లీ వేడుకలు

Published on

-Advertisement-

సాయిలింగిలో సాయిబాబా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా
మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో సాయిబాబా ఆలయ 25వ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవాన్ని సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా లేబర్ అసిస్టెంట్ కమిషనర్ ముత్యం రెడ్డి, వారి సతీమణి ఆలయానికి విచ్చేసి సాయిబాబా దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడిన ముత్యం రెడ్డి… “సాయిబాబా అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలి. ఇటువంటి సేవా కార్యక్రమాలు గ్రామాలకు ఆధ్యాత్మిక బలం ఇస్తాయి” అని పేర్కొన్నారు.

ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వాహకులు విజయవంతంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తోట శివాజీ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ వాతావరణం భక్తి రసపూరితంగా మారి జూబ్లీ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Latest articles

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...

రూ.7 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి పూజ..

మన భారత్, తాంసి: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో సీసీ కల్వర్టు నిర్మాణానికి...

రైతులకు ఊరట – మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మన భారత్, తాంసి: రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని బోథ్ ఎమ్మెల్యే Anil...

అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు పంపిణీ

మన భారత్, తలమడుగు:  తలమడుగు, తాంసి మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు మరియు సూపర్వైజర్లకు స్థానిక ఎమ్మెల్యే Anil Jadhav...

More like this

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...

రూ.7 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి పూజ..

మన భారత్, తాంసి: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో సీసీ కల్వర్టు నిర్మాణానికి...

రైతులకు ఊరట – మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మన భారత్, తాంసి: రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని బోథ్ ఎమ్మెల్యే Anil...