పిల్లల ఆరోగ్యానికి ఏ పాలు మంచివి.?

Published on

-Advertisement-

నిపుణుల ముఖ్య సూచనలు తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి
మన భారత్ – హెల్త్ డెస్క్ హైదరాబాద్: చిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎక్కువగా అయోమయంలో పడే ప్రశ్నల్లో ప్రధానంగా ఉండేది—పిల్లలకు ఏ పాలు మంచివి? నూతన శిశువుల నుంచి రెండు సంవత్సరాల వయస్సు వరకు పాలు ఎంపికలో జాగ్రత్త అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సంవత్సరం లోపు పిల్లలకు ఆవు పాలు ఎందుకు వద్దంటే?
పుట్టిన శిశువులకు 12 నెలల లోపు ఆవు పాలు ఇవ్వకూడదని బాలరోగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవు పాలలోని ఐరన్ శాతం చాలా తక్కువగా ఉండటంతో పాటు, అందులో ఉన్న కొన్ని ప్రోటీన్లు శిశువుల ప్రేగులపై ప్రభావం చూపి అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇది ఐరన్ లోపంతోపాటు రక్తహీనతకు కారణం కావచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

గేదె పాలు ఎందుకు ఆలస్యంగా ఇవ్వాలి?
గేదె పాలలో ప్రోటీన్లు, ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల చిన్నారుల కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే రెండేళ్ల వయస్సు వచ్చే వరకు గేదె పాలు ఇవ్వకుండా ఉండాలని సూచిస్తున్నారు.

ఏం చేయాలి?
పుట్టిన పిల్లల కోసం తల్లిపాలు ఉత్తమమైన ఆహారం. ఒక సంవత్సరానికి పైగా వచ్చిన తర్వాత మాత్రమే ఆవు పాలను ఆహారంలో చేర్చాలని, గేదె పాలను రెండో ఏట తర్వాత ప్రారంభించాలన్నారు. ప్రతి చిన్నారి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉండే కారణంగా, పాలు ప్రారంభించే ముందుగా పిల్లల వైద్యుడి సలహా తీసుకోవడం అత్యంత అవసరం.

కుటుంబాలు ఈ సూచనలను పాటిస్తే, చిన్నారుల ఆరోగ్యం మరింత బలపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...