తొలిరోజే నామినేషన్ల వరద.!

Published on

-Advertisement-

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహం ఉరకలు – సర్పంచ్, వార్డు స్థానాలకు భారీ ఎత్తున దరఖాస్తులు

మన భారత్, తెలంగాణ: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి రోజు నుంచే భారీ స్పందన లభించింది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు నామినేషన్ల దాఖలులో హడావుడి చేశారు. ఒక్కరోజులోనే 3,242 సర్పంచ్, 1,821 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు సమర్పించడంతో ఎన్నికల వేడి స్పష్టమైంది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకారం, తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఈ నెల 29 వరకు కొనసాగుతుంది. 30న పరిశీలన, డిసెంబర్ 3వ తేదీ వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

ఈ విడతలో మొత్తం 4,236 గ్రామాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే వచ్చిన భారీ నామినేషన్లు ఈ ఎన్నికల్లో పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో ముందుగానే సూచిస్తున్నాయి.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...