భార్యపై దాడి… భర్త రిమాండ్‌కు

Published on

-Advertisement-

మద్యం మత్తులో భార్యపై దాడి… భర్త రిమాండ్‌కు తరలింపు

మన భారత్, తాంసి: మండలంలోని కప్పర్ల గ్రామంలో గృహహింస ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ ఫణిదర్ తెలిపారు.

సీఐ వివరాల మేరకు.. కప్పర్ల గ్రామానికి చెందిన మల్లెల నరేష్ మద్యానికి బానిసై తరచూ భార్య లావణ్యతో గొడవపడి వేధింపులకు గురి చేసేవాడు. ఈ నెల 23న పరిస్థితి మరింత విషమించి, మద్యం మత్తులో నరేష్ ఇనుప పట్టితో తన భార్యపై దాడి చేశాడు. దీంతో లావణ్య తీవ్రగాయాలతో వేదన అనుభవించాల్సి వచ్చింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, బుధవారం నరేష్‌ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆయనను రిమాండ్‌కు తరలించేందుకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ చర్యల్లో సీఐ ఫణిదర్‌తో పాటు ఎస్సై జీవన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Latest articles

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

More like this

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...