పంట నష్టం.. యువ రైతు ఆత్మహత్య

Published on

-Advertisement-

పంట నష్టం… యువ రైతు ఆత్మహత్య

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. డోర్లీ గ్రామానికి చెందిన జలారపు లింగన్న (22) అనే యువరైతు పంట నష్టాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాకలి కులానికి చెందిన లింగన్న తన తండ్రి జలారపు కిష్టన్న పేరుతో ఉన్న మూడు ఎకరాలు 30 గుంటల పొలంలో కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ సీజన్‌లో పత్తి పంట సాగు కోసం అప్పులు తెచ్చుకున్న లింగన్న, భారీ వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 23న రాత్రి సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని తక్షణమే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

మృతుడి తల్లి జలారపు విమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...