నేడు పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల.!

Published on

-Advertisement-

నేడు పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల!

మన భారత్, న్యూ డిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు నేడు 19వ తేదీ బుధవారం 21విడత నిధులు విడుదలl కానున్నాయి, మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నేరుగా రూ”2,000 చొప్పు న జమ కానున్నాయి…

వీటితోపాటు..అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత నిధులు రూ.5 వేలు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒకేరోజు రూ.7 వేల నగదు జమ కానుంది.అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద మొత్తం 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,135 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి.

ఇందులో అన్నదాత సుఖీభవ పథకం రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.2,342.92కోట్లు కాగా.. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం వాటా రూ. 972.09 కోట్లు ఉంటుంది.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీ యేటా మూడు విడతల్లో డబ్బులు జమ చేసేందుకు నిర్ణయించింది.

పిఎం కిసాన్ పథకంతో కలిపి మూడు విడతల్లో మొత్తం రూ.20 వేలు జమ చేస్తామని చెప్పింది. తొలి విడత రూ.7 వేలు, రెండో విడత రూ.7 వేలు, మూడో విడత రూ.6 వేలు ఇస్తా మని కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత డబ్బులు రైతులు బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. రెండు విడతల్లో కలిపి ఈ పథకం కింద మొత్తం రూ.6,309. 44 కోట్లు ప్రభుత్వం అందించినట్లు తెలుస్తుంది.

Latest articles

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్...

More like this

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....