డిసెంబర్‌కి ముందే గడ్డకట్టే చలి..

Published on

-Advertisement-

డిసెంబర్‌కి ముందే గడ్డకట్టే చలి… తెలంగాణ ఉత్తరంలో జనజీవనం అస్తవ్యస్తం

మన భారత్, హైదరాబాద్:ఈసారి చలికాలం తెలంగాణ రాష్ట్రాన్ని ముందుగానే వణికిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్‌ వంటి ఉత్తర జిల్లాల్లో గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు గడ్డకట్టే చలిని అనుభవిస్తున్నారు. డిసెంబర్‌ మొదలయ్యేలోపే చలి పంజా విసరడం, గ్రామీణ ప్రాంతాల్లో జీవనపరమైన ఇబ్బందులను మరింత పెంచుతోంది.

పగటిపూట కూడా చల్లని గాలులు దూసుకురావడంతో జనజీవనం స్తంభించిన స్థితి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల నుంచి వచ్చే ఈశాన్య గాలులు చలితీవ్రతను మరింత పెంచుతున్నాయి. ఈ అసాధారణ వాతావరణ మార్పు ప్రజారోగ్యానికి, వ్యవసాయానికి, విద్యార్థుల జీవితాలకు పెద్ద సవాల్‌గా మారింది.

ప్రజారోగ్యంపై ప్రమాద సంకేతాలు

చలిగాలుల దాడితో చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దగ్గు, జలుబు, న్యుమోనియా కేసులు విపరీతంగా పెరగగా, అధిక చలి కారణంగా రక్తనాళాల సంకోచం వల్ల గుండెపోటు ప్రమాదం కూడా పెరిగిందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంక్షేమ హాస్టళ్లలో దయనీయ పరిస్థితి

సంగారెడ్డి, సూర్యాపేట, కోదాడ జిల్లాల్లోని ప్రభుత్వ వసతి గృహాలు చలి తీవ్రతకు పూర్తిగా సిద్ధంగా లేవు. ఎక్కడో వేడి నీటి యంత్రాలు పనిచేయడం లేదు… ఎక్కడో దుప్పట్లు, రగ్గులు సరిపడా లేవు. కొందరు విద్యార్థులు కిటికీలు, తలుపులే లేని గదుల్లో నేలపైనే వణుకుతూ నిద్రిస్తున్న పరిస్థితి తీవ్ర చర్చనీయాంశమైంది. జహీరాబాద్ బాలికల హాస్టల్‌లో మంచాలు లేక నేలపై పడుకోవాల్సి రావడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

వ్యవసాయంపై గట్టి దెబ్బ

చలి తీవ్రత యాసంగి సీజన్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. వరి నారు ఎదుగుదల మందగించడంతో నారు నాట్లు ఆలస్యం కావడం ఖాయం. పత్తి పంట నాణ్యత తగ్గి దిగుబడులు పడిపోవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కూరగాయల పంటల్లో కాత, పూత తగ్గే ప్రమాదం కూడా ఉంది.

ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి

ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అప్రమత్తం కావాలని ప్రజలు కోరుతున్నారు. హాస్టళ్లలో వేడి నీటి సదుపాయాలు, దుప్పట్లు, పరుపులు అత్యవసరంగా పంపిణీ చేయాలి. నిరాశ్రయులకు రాత్రి ఆశ్రయ కేంద్రాలు పెంచడం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అవసరం. పౌరులు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉన్ని బట్టలు ధరించడం, వేడి ఆహారం తీసుకోవడం, తీవ్రమైన చలిలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Latest articles

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు..

 గ్రామంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన పశువైద్య శాఖ మన భారత్, తలమడుగు: పశుసంపద రైతులకు ప్రధాన ఆర్థిక ఆధారంగా...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్...

More like this

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు..

 గ్రామంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన పశువైద్య శాఖ మన భారత్, తలమడుగు: పశుసంపద రైతులకు ప్రధాన ఆర్థిక ఆధారంగా...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...