20.76 శాతం పోలింగ్ నమోదు..

Published on

-Advertisement-

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్న పోలింగ్

 

హైదరాబాద్, నవంబర్ 11: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రారంభం నుండి పోలింగ్ సజావుగా కొనసాగుతుండగా, ఎక్కడా పెద్దగా అవాంఛనీయ ఘటనలు జరగలేదు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు. కొద్ది సేపటికి షేక్‌పేట పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించిందని, కానీ టెక్నికల్ బృందం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిందని చెప్పారు.

మొత్తం 6 పోలింగ్ కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలను యుద్ధప్రాతిపదికన సరి చేయడం జరిగింది. ఎలాంటి అంతరాయం లేకుండా పోలింగ్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈసారి గత ఎన్నికలతో పోలిస్తే 40 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదైందని ఆర్వీ కర్ణన్ తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయి. ఎక్కడైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండి పహారా కాస్తున్నారు. ఎన్నికల అధికారులు ఓటర్లను శాంతంగా, క్రమశిక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...