కామ్రేడ్ దాజి శంకర్ కృషి మారువలేనిది..

Published on

-Advertisement-

దాజి శంకర్ కృషి మారువలేనిది – సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన నేతకు ఘన నివాళి

మన భారత్, తాంసీ, నవంబర్ 10: ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాన్ని అర్పించిన నాయకుడు కామ్రేడ్ దాజీ శంకర్ కృషి మారువలేనిదని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన 39వ వర్ధంతి సందర్భంగా తాంసీ మండలంలోని ఈదుల్లా సవర్గాం గ్రామంలో ఉన్న దాజీ శంకర్ స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దాజీ శంకర్ ప్రజా ఉద్యమాలకు ప్రేరణనిచ్చిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, కార్మికులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం నిస్వార్థంగా శ్రమించిన దాజీ శంకర్ తెలంగాణ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో AITUC కార్యదర్శి విలాస్, CPI నాయకులు దేవిదాస్, నళిని, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం దాజీ శంకర్ సేవలను స్మరించుకుంటూ నాయకులు ప్రజా సమస్యలపై అవగాహన చర్చలు జరిపారు.

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...