కామ్రేడ్ దాజి శంకర్ కృషి మారువలేనిది..

Published on

-Advertisement-

దాజి శంకర్ కృషి మారువలేనిది – సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన నేతకు ఘన నివాళి

మన భారత్, తాంసీ, నవంబర్ 10: ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాన్ని అర్పించిన నాయకుడు కామ్రేడ్ దాజీ శంకర్ కృషి మారువలేనిదని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన 39వ వర్ధంతి సందర్భంగా తాంసీ మండలంలోని ఈదుల్లా సవర్గాం గ్రామంలో ఉన్న దాజీ శంకర్ స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దాజీ శంకర్ ప్రజా ఉద్యమాలకు ప్రేరణనిచ్చిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, కార్మికులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం నిస్వార్థంగా శ్రమించిన దాజీ శంకర్ తెలంగాణ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో AITUC కార్యదర్శి విలాస్, CPI నాయకులు దేవిదాస్, నళిని, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం దాజీ శంకర్ సేవలను స్మరించుకుంటూ నాయకులు ప్రజా సమస్యలపై అవగాహన చర్చలు జరిపారు.

Latest articles

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...

రూ.7 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి పూజ..

మన భారత్, తాంసి: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో సీసీ కల్వర్టు నిర్మాణానికి...

More like this

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...