తేమ శాతం పేరుతో రైతులను దోచుకుంటున్న ప్రభుత్వాలు

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్: రైతులను దోచుకోవడం తప్ప ప్రభుత్వాలకు వేరే పనిలేదు” అని భారతీయ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూమా రెడ్డి  తీవ్రంగా మండిపడ్డారు. గురువారం తాంసి మండల కేంద్రంలో భారతీయ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా భూమా రెడ్డి మాట్లాడుతూ, “సీసీఐ సంస్థలు పత్తి కొనుగోళ్లలో రైతులను నష్టపరుస్తున్నాయి. తేమ శాతం పేరుతో పత్తి బేళ్లను తిరస్కరించడం అన్యాయం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కనీసం 18 శాతం తేమతో పత్తి కొనుగోలు చేయాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

రైతులు ఎండవానల మధ్య కష్టపడి పంటను పండిస్తే, ప్రభుత్వ విధానాల కారణంగా వారికి న్యాయం దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ అధికారులు రైతులకు మేలు చేసే విధంగా కొనుగోలు ప్రమాణాలను మార్చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు కేతి రెడ్డి కృష్ణ రెడ్డి, జిల్లా కార్యదర్శి అడేపు శ్రీనివాస్, తాంసి మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్, ఇతర రైతులు పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Latest articles

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

More like this

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....