ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం

Published on

📰 Generate e-Paper Clip

వ్యయం 12% తగ్గనుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం బీఆర్‌ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టును సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మునుపటి ప్రణాళికలతో పోలిస్తే ప్రాజెక్టు వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. “ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి సుందిళ్ల లింక్‌ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేసింది. ఈ సవరణలతో మొత్తం వ్యయం దాదాపు 10 నుంచి 12 శాతం వరకు తగ్గుతుంది,” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. అలాగే, భూసేకరణ అవసరమయ్యే విస్తీర్ణం కూడా దాదాపు సగానికి తగ్గుతుందని, దీంతో ప్రభుత్వానికి సుమారు రూ.1,500 నుంచి రూ.1,600 కోట్ల వరకు ఆదా కాబోతోందని తెలిపారు. ఈ మార్పులు ప్రాజెక్టు ఆర్థిక భారం తగ్గించడమే కాక, త్వరితగతిన పూర్తి చేసే దిశగా ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. “ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు తెలంగాణ రైతులకు ప్రాణాధారం అవుతుంది. తక్కువ ఖర్చుతో, ఎక్కువ లాభం అందేలా ఈ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నాం,” అని ఆయన చెప్పారు.

మన భారత్ , ప్రతినిధి 

Latest articles

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

More like this

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...