మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Published on

-Advertisement-

ఎల్లారెడ్డిపల్లిలో మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మన భారత్,మొగుళ్ళపల్లి:

భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేశారని కొనియాడారు. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నేడు ఆయన పేరుతో విద్యాసంస్థలు కొనసాగుతున్నాయని, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని ఆయన ఆనాడే నిరూపించారని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం వల్లనే నేడు ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారన్నారు. మన జీవితంలోని ప్రతి అడుగులోనూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాల ఫలాలను అనుభవిస్తున్నామని తెలిపారు. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలని ఎమ్మెల్యే కొనియాడారు. అట్టడుగు, బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందించడంతో పాటు మహిళలు చదువుకోవాలనే గొప్ప లక్ష్యంతో జ్యోతిరావు పూలేతో కలిసి దేశంలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా వారి ఆశయాలను, సిద్ధాంతాలను భావితరాలకు అందిస్తూ వారు చూపిన మార్గంలో నడవడమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని తెలిపారు.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...