సీఎం రేవంత్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్..!

Published on

-Advertisement-

‘నువ్వు ఎంత రెచ్చగొట్టినా నేను తొందరపడను’

హామీలు అమలు చేసి తర్వాత మాట్లాడాలని సూచన

మన భారత్, హైదరాబాద్:

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి మరియు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

ఏ అంశంపై అయినా బహిరంగ చర్చకు సిద్ధమని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ఎన్నికల హామీలు, అభివృద్ధి అంశాలపై ఎక్కడ చర్చ పెట్టాలో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డిని సవాల్ చేశారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.

ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు” అని వ్యాఖ్యానించారు. తనను భయపెట్టే వ్యక్తి తెలంగాణలో ఇంకా పుట్టలేదని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలను తాను వ్యక్తిగతంగా తీసుకోనని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయ పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

తాను రాజకీయ జీవితంలో ఒకే సిద్ధాంతంతో ముందుకు సాగానని, ఇతర పార్టీలను మారుతూ రాజకీయ ప్రయాణం చేయలేదని వ్యాఖ్యానించారు. “నా పుట్టుక, నా చావు రెండూ బీజేపీలోనే ఉంటాయి” అని పేర్కొంటూ పార్టీ పట్ల తన నిబద్ధతను వెల్లడించారు. తానెవరో, తన రాజకీయ ప్రస్థానం ఏమిటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని అన్నారు.

రేవంత్‌రెడ్డి ఎంతగా రెచ్చగొట్టినా తాను తొందరపడి స్పందించబోనని, సమయమే అన్ని విషయాలకు సమాధానం చెబుతుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రికి సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాత ఇతర రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

రాష్ట్రంలో దళితులు, బీసీలు సహా వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చెప్పారు.

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కలకలం..

పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కలకలం.. ల్యాబ్‌కు శాంపిల్స్ పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వరంగల్‌లో వినియోగదారుడి ఫిర్యాదుతో దర్యాప్తు.....

ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

తాంసీ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కలిసి పనిచేస్తాం: సర్పంచ్...

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం.. మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య...

“అమ్మ మాట.. అంగన్వాడి బాట” సర్పంచ్

'అమ్మ మాట.. అంగన్వాడి బాట’లో చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసం విద్యకు తొలి అడుగు అంగన్వాడితోనే.. తల్లిదండ్రులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి:...

More like this

పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కలకలం..

పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కలకలం.. ల్యాబ్‌కు శాంపిల్స్ పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వరంగల్‌లో వినియోగదారుడి ఫిర్యాదుతో దర్యాప్తు.....

ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

తాంసీ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కలిసి పనిచేస్తాం: సర్పంచ్...

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం.. మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య...