మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా.?

Published on

-Advertisement-

ఇలా చేస్తే స్పీడ్ పెరుగుతుంది

మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తరచుగా ఎదుర్కొనే సమస్యల్లో ఫోన్ హ్యాంగ్ అవడం ఒకటి. యాప్స్ ఓపెన్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ఫోన్ స్లోగా పనిచేయడం, బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం వంటి సమస్యలకు సులభమైన పరిష్కారం ఫోన్‌ను క్రమం తప్పకుండా రీస్టార్ట్ చేయడమేనని టెక్నాలజీ నిపుణులు సూచిస్తున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు ఒకసారి లేదా కనీసం వారానికి రెండు సార్లు ఫోన్‌ను ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది. ఫోన్ నిరంతరం పనిచేస్తున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో అనేక యాప్స్, ప్రాసెస్‌లు నడుస్తూ ఉంటాయి. ఇవి ఫోన్ ర్యామ్‌ను వినియోగించి పనితీరును మందగింపజేస్తాయి.

ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ద్వారా అవసరం లేని బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లు ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతాయి. దీంతో ర్యామ్ ఖాళీ అవడంతో ఫోన్ వేగంగా స్పందిస్తుంది. అదేవిధంగా బ్యాటరీపై పడే అదనపు భారం కూడా తగ్గుతుంది.

రీస్టార్ట్ చేయడం వల్ల మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయని నిపుణులు చెబుతున్నారు. సిగ్నల్ సమస్యలు, డేటా స్లోగా పనిచేయడం వంటి ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా అవసరం లేని యాప్స్‌ను తొలగించడం, ఫోన్ స్టోరేజ్‌లో ఖాళీ స్థలం ఉంచడం, సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ద్వారా కూడా మొబైల్ పనితీరును మరింత మెరుగుపరచుకోవచ్చని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కలకలం..

పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కలకలం.. ల్యాబ్‌కు శాంపిల్స్ పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వరంగల్‌లో వినియోగదారుడి ఫిర్యాదుతో దర్యాప్తు.....

ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

తాంసీ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కలిసి పనిచేస్తాం: సర్పంచ్...

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం.. మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య...

“అమ్మ మాట.. అంగన్వాడి బాట” సర్పంచ్

'అమ్మ మాట.. అంగన్వాడి బాట’లో చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసం విద్యకు తొలి అడుగు అంగన్వాడితోనే.. తల్లిదండ్రులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి:...

More like this

పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కలకలం..

పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కలకలం.. ల్యాబ్‌కు శాంపిల్స్ పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వరంగల్‌లో వినియోగదారుడి ఫిర్యాదుతో దర్యాప్తు.....

ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

తాంసీ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కలిసి పనిచేస్తాం: సర్పంచ్...

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం.. మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య...