మన భారత్, తాంసి: కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని తాంసి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు కౌడాల సంతోష్ అన్నారు.
ఇటీవల తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన కౌడాల సంతోష్ను ఆదివారం కప్పర్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆత్మ చైర్మన్ నారాయణను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలను ప్రోత్సహించే పార్టీ అని అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు నాయకత్వం సముచిత అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రానున్న రోజుల్లో తాంసి మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, గ్రామ గ్రామాన పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కప్పర్ల గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్, ఉపసర్పంచ్ నరసింహులు, సంజీవ్, మహేందర్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
