కార్మికుల వేతనాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం

Published on

-Advertisement-

హామీలు అమలు చేయకపోతే సమ్మె తప్పదన్న సీఐటీయూ నేతలు

మన భారత్ | నాగర్ కర్నూల్ జిల్లా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల వేతనాల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య విమర్శించారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కార్మికులను పనులు చేయించడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన గ్రామపంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోని 12,572 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులు జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సమ్మెల సమయంలో కార్మికులకు మద్దతుగా మాట్లాడిన నాయకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.

అలాగే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మల్టీపర్పస్ విధానం కారణంగా గ్రామపంచాయతీ కార్మికులపై అదనపు భారం పడిందని, చేయని పనులు కూడా వారితో చేయిస్తున్నారని మండిపడ్డారు. ఒక నెల జీతం ఆలస్యమైనా ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే, మూడు నెలలుగా వేతనాలు లేక గ్రామపంచాయతీ కార్మికుల కుటుంబాలు ఎలా జీవించాలనే పరిస్థితి నెలకొందని అన్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం కొత్తగా ఎన్నికైన కొంతమంది సర్పంచులు, ఉపసర్పంచులు, సెక్రటరీలు పాత కార్మికులను తొలగించి కొత్తవారిని నియమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల కార్మికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.

ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు విడుదల చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అక్రమ తొలగింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం జూలై 1న మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆందోళనలను విజయవంతం చేయడానికి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే జూలై 8న జిల్లా కలెక్టరేట్ల దిగ్భంధనం చేపడతామని, అనంతరం జూలై 20 తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, కురుమయ్య, శాంతయ్య, కృష్ణయ్య, బాలస్వామి, వెంకటయ్య, శివ, అశోక్, నాగయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

అంబేద్కర్ విగ్రహావిష్కరణ మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం..

పల్లి (బి)లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఆహ్వానం మన భారత్, జూలై 23 తలమడుగు: తలమడుగు మండలం...

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా డబుల్ ఓటర్లు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా...

అంతరాష్ట్ర రహదారిపై కాంగ్రెస్ నేతల ఆందోళన

తలమడుగులో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సుంకిడి వద్ద అంతరాష్ట్ర రహదారిపై ఆందోళన మన భారత్, తలమడుగు:...

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

More like this

అంబేద్కర్ విగ్రహావిష్కరణ మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం..

పల్లి (బి)లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఆహ్వానం మన భారత్, జూలై 23 తలమడుగు: తలమడుగు మండలం...

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా డబుల్ ఓటర్లు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా...

అంతరాష్ట్ర రహదారిపై కాంగ్రెస్ నేతల ఆందోళన

తలమడుగులో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సుంకిడి వద్ద అంతరాష్ట్ర రహదారిపై ఆందోళన మన భారత్, తలమడుగు:...