మన భారత్,తాంసి:
ప్రజాపాలన ప్రగతి నివేదిక కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పరీక్షల నిర్వహణ విధానం, షెడ్యూల్ పరీక్షలపై అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలపై మార్గదర్శనం చేశారు.
కళాశాల ప్రిన్సిపాల్ R ఉదయ భాస్కర్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలను భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు. చదువులో ఒత్తిడిని తగ్గించేందుకు సరైన ప్రణాళిక, సమయపాలన ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులతో నేరుగా సంభాషిస్తూ వారి సందేహాలను నివృత్తి చేసి, మానసిక ధైర్యాన్ని పెంపొందించేలా ప్రేరణాత్మక సూచనలు అందించారు.
అదేవిధంగా పరీక్షల సమయంలో కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ప్రశాంతమైన మనస్సుతో పరీక్షలకు సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించగలరని అధ్యాపకులు వివరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజేందర్, సురేష్తో పాటు నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
