మన భారత్ , ఉట్నూర్ :
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ITDA) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి (PO)గా మంద మకరందు ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఐటిడిఏ కార్యాలయంలో జరిగిన సాదాసీదా కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఇప్పటివరకు ఉట్నూర్ ITDA POగా పనిచేసిన యువరాజ్ మర్మాట్ను ప్రభుత్వం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు అదనపు కలెక్టర్గా బదిలీ చేయడంతో, ఆయన స్థానంలో మంద మకరందును నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మకరందు మాట్లాడుతూ గిరిజనుల సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
గ్రామీణ మరియు దూర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి చేరవేయడం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల విస్తరణకు ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సమీక్షలు నిర్వహిస్తూ, వాటి అమలులో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటానని మకరందు తెలిపారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
స్థానిక అధికారులు, సిబ్బంది మకరందుకు అభినందనలు తెలుపుతూ ఆయనతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు సహకరిస్తామని తెలిపారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
