వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు..

Published on

-Advertisement-

మన భారత్ ,ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి కీలక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, ఒకేసారి 16 మండలాల్లో తనిఖీలు చేపట్టడం విశేషం.

ఈ దాడుల్లో భాగంగా మొత్తం 45 బృందాలు పాల్గొని అనుమానాస్పదంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులపై సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో 15 కేసులు నమోదు చేసి, అక్రమాలకు సంబంధించిన పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

దాడుల సమయంలో ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, బాండ్ పేపర్లు, స్టాంప్ పేపర్లు వంటి పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఆధారంగా తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లాలో రైతులు, సామాన్య ప్రజలను అధిక వడ్డీల పేరుతో దోపిడీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇటీవల కాలంలో వడ్డీ వ్యాపారుల దోపిడీపై పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఈ చర్యలతో జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

More like this

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...