మన భారత్, తలమడుగు:
తలమడుగు మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్పై విద్యార్థులపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రాధిక తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు, పాఠశాలలో చదువుతున్న కొంతమంది విద్యార్థులను ఉపాధ్యాయుడు అనుచితంగా తాకాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు.
బాలల రక్షణ చట్టం కింద (POCSO) కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్కు ఆదేశించినట్లు సమాచారం.
ఈ ఘటనతో ప్రాంతంలో ఆందోళన నెలకొంది. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల్లో పర్యవేక్షణ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
