స్వయంభు వినాయక ఆలయంలో చోరీ..

Published on

-Advertisement-

మన భారత్: అదిలాబాద్:

అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న స్వయంభు గణపతి ఆలయంలో చోరీ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఆలయంలోని హుండీని దుండగులు పగలగొట్టి నగదు అపహరించినట్లు భక్తులు గమనించారు.

బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ కమిటీ సభ్యులు జాదవ్ శ్రావణ్ నాయక్, భాస్కర్ గౌడ్ వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రైనీ ఎస్పీ రాహుల్ కాంత్, ఎస్‌హెచ్ఓ మావల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ఘటనతో స్థానికంగా భద్రతపై చర్చ మొదలైంది. ఆలయాల్లో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెసు పార్టీ యువనాయకులు శ్రావణ్ నాయక్, భాస్కర్ గౌడ్, ఠాగూర్, వెంకట్ రెడ్డి, సంతోష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

రైళ్లలో మగవారికి ఉచిత ప్రయాణం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తోంది. నగరవ్యాప్తంగా నడిచే...

రైతులకు శుభవార్త.. 45 లక్షల రైతులకు లాభం

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం రెండో విడత నిధులను...

More like this

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

రైళ్లలో మగవారికి ఉచిత ప్రయాణం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తోంది. నగరవ్యాప్తంగా నడిచే...