ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం అర్లి (కే) గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం చేపట్టిన పనులకు శుభారంభం జరిగింది. గ్రామంలోని పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు, అలాగే రోడ్డు కల్వర్టు నిర్మాణానికి రూ.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్‌ఆర్‌ఈజీఎస్ (NREGS) ద్వారా మంజూరు చేయగా, ఈ పనులకు గ్రామంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ కు అర్లి (కే) గ్రామస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం జరగడం వల్ల విద్యార్థుల భద్రత మెరుగుపడటంతో పాటు పాఠశాల పరిసరాలు కూడా సక్రమంగా ఉంటాయని గ్రామస్తులు పేర్కొన్నారు.

అదేవిధంగా రోడ్డు కల్వర్టు నిర్మాణం వల్ల వర్షాకాలంలో ప్రజలకు ఎదురయ్యే రాకపోకల ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు తీసుకువచ్చిన ఎంపీ గోడం నగేష్‌కు గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బోండ్ల వెంకట స్వామి, గ్రామ సర్పంచ్ నారు లక్ష్మి వెంకన్న, ఉపసర్పంచ్ కే. మహావీర్, గ్రామ సెక్రటరీ అర్చన, వార్డు సభ్యులు గజానన్, శ్రీకాంత్, జంగు, లస్మన్న, భగవండ్లు, కోరండ్ల పురుషోత్తం, భాపు రెడ్డి, ఉపాధ్యాయులు సంజీవ్, ప్రశాంత్, సుధాకర్, అలాగే బీజేపీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest articles

వేధిస్తున్న ఎండలు.. వడదెబ్బతో మరణాలు

మన భారత్, తెలంగాణ:  రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలతో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల...

డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు షురూ.!

మన భారత్, తెలంగాణ:  బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత...

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

మన భారత్, ఆదిలాబాద్: నెరడిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో నాఫెడ్ సహకారంతో, తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్...

మాజీ ఎమ్మెల్యేకు జాగృతిలో కీలక బాధ్యతలు.. 

మన భారత్, ఆదిలాబాద్: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి పార్టీలోకి...

More like this

వేధిస్తున్న ఎండలు.. వడదెబ్బతో మరణాలు

మన భారత్, తెలంగాణ:  రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలతో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల...

డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు షురూ.!

మన భారత్, తెలంగాణ:  బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత...

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

మన భారత్, ఆదిలాబాద్: నెరడిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో నాఫెడ్ సహకారంతో, తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్...