ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు..
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం అర్లి (కే) గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం చేపట్టిన పనులకు శుభారంభం జరిగింది. గ్రామంలోని పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు, అలాగే రోడ్డు కల్వర్టు నిర్మాణానికి రూ.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) ద్వారా మంజూరు చేయగా, ఈ పనులకు గ్రామంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం...