మన భారత్, న్యూఢిల్లీ:
మానవ అభివృద్ధిలో కృత్రిమ మేధస్సు (AI) కీలక మలుపుగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన సాంకేతిక సమ్మిట్లో ఆయన ప్రసంగిస్తూ, మనుషులు మరియు టెక్నాలజీ కలిసి పనిచేసే కొత్త దశలో ప్రపంచం ప్రవేశిస్తున్నదని అన్నారు.
ఈ సాంకేతిక విప్లవాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించాలంటే విశాల దృష్టికోణం (విజన్) అవసరమని తెలిపారు. AI అభివృద్ధిలో భారత్ కేవలం భాగస్వామిగా కాకుండా ముందుండి దారితీసే దేశంగా అవతరిస్తోందని పేర్కొన్నారు.

అదే సమయంలో, AI వంటి ఆధునిక సాంకేతికతలు మానవ విలువలను దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. “ఈ కొత్త సాంకేతికత మనుషులను ముడి పదార్థాలుగా మార్చే పరిస్థితి రాకూడదు. టెక్నాలజీ ఎప్పుడూ మానవ నియంత్రణలోనే ఉండాలి” అని స్పష్టం చేశారు.
AI వినియోగంలో నైతిక ప్రమాణాలు, నియంత్రణ వ్యవస్థలు, బాధ్యతాయుత విధానాలు అవసరమని, ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
