పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ప్రమాదాలను నివారించే ఉద్దేశ్యంతో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ బి. ప్రణయ్ కుమార్ తెలిపారు.

ఈ మేరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాలను పట్టణంలోకి అనుమతించబోమని వెల్లడించారు. రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.

ప్రతిరోజు ఉదయం స్థానిక మావల వైపు నుండి వచ్చే వాహనాలు తిరుమల పెట్రోల్ బంక్ వరకు, అలాగే రైల్వే స్టేషన్ వరకు, ఆర్టీవో కార్యాలయం రైల్వే గేటు నుండి ‘ఐ లవ్ ఆదిలాబాద్’ వరకు పట్టణ పరిధిలో పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లో ఉంటాయని వివరించారు.

ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ట్రాఫిక్ సీఐ బి. ప్రణయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

More like this

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...