సంక్రాంతి క్రికెట్‌ టోర్నీ విజేతగా జీవైసీ..

Published on

-Advertisement-

తాంసిలో ఉత్సాహంగా టీపీఎల్‌ సంక్రాంతి కప్‌ పోటీలు

మన భారత్, తాంసి: తాంసి ప్రీమియర్ లీగ్‌ (టీపీఎల్‌) కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి క్రికెట్‌ కప్‌ పోటీలు క్రీడాభిమానులను అలరించాయి. పండుగ వాతావరణంలో హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటింది.

ఈ పోటీల్లో విద్యానగర్‌, ఆటో యూనియన్‌, అంబేద్కర్‌ యువజన సంఘం, జ్ఞానోదయ యువజన సంఘం (జీవైసి) పేరుతో మొత్తం నాలుగు జట్లు పోటీపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ల అనంతరం జ్ఞానోదయ యువజన సంఘం జట్టు విజేతగా నిలిచి సంక్రాంతి కప్‌ను కైవసం చేసుకుంది.

ఫైనల్‌ పోటీలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జీవైసి జట్టు నిర్ణీత 8 ఓవర్లలో 45 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఏవైసీ జట్టు జీవైసి బౌలర్ల ధాటికి తట్టుకోలేక ఐదు ఓవర్లలో కేవలం 18 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో జీవైసి జట్టు ఘన విజయం సాధించింది.

టోర్నీలో విజేతగా నిలిచిన జ్ఞానోదయ యువజన సంఘం జట్టుకు టీపీఎల్‌ చైర్మన్‌ రత్న ప్రకాష్‌ బహుమతి మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు యువతలో ఐక్యతను పెంపొందిస్తాయని, ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడతాయని తెలిపారు.

Latest articles

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

రాహుల్ గాంధీ పై దాడికి నిరసన..

రాహుల్ గాంధీ పై దాడికి నిరసన - రోడ్డుపై బైఠాయించిన మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ శ్రేణులు మన భారత్, మొగుళ్ళపల్లి: కాంగ్రెస్...

More like this

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...