సిద్దిపేట మెడికల్ కాలేజీలో విషాదం..

Published on

-Advertisement-

హౌస్ సర్జన్ లావణ్య మృతి కేసులో కీలక మలుపు

మన భారత్, సిద్దిపేట : సిద్దిపేట మెడికల్ కళాశాలలో చోటు చేసుకున్న హౌస్ సర్జన్ లావణ్య మృతి ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య, సిద్దిపేట మెడికల్ కాలేజీలో 2020 బ్యాచ్ మెడిసిన్ విద్యార్థినిగా చదువుకుని, ప్రస్తుతం హౌస్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో కళాశాల ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

లావణ్య మృతికి గల కారణాలపై మొదట అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, కుటుంబ సభ్యులు, సహచరుల వాంగ్మూలాలు సేకరించడంతో పాటు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలీసుల విచారణ ప్రకారం, లావణ్యకు డాక్టర్ ప్రణయ్ తేజ్‌తో గత ఏడాది నుంచి సన్నిహిత సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. పెళ్లి విషయానికి వచ్చేసరికి కుల భేదాన్ని కారణంగా చూపుతూ ప్రణయ్ వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఈ పరిణామం లావణ్యను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసిందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కాల్ రికార్డులు, చాట్ వివరాలు తదితర సాంకేతిక ఆధారాల ఆధారంగా డాక్టర్ ప్రణయ్ తేజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన వైద్య విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, ఒత్తిడిని ఎదుర్కొనే వ్యవస్థలపై మరోసారి చర్చకు దారి తీసింది. కేసుపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని సిద్దిపేట పోలీసులు తెలిపారు.

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

More like this

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...