ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు పై క్లారిటీ..!

Published on

-Advertisement-

ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు కాదు.. ప్రభుత్వం స్పష్టత

మన భారత్, తెలంగాణ: ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేశారనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా కొంత గందరగోళం నెలకొంది. ఇటీవల కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మండలాల పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ అకౌంట్ల నుంచి జరిగే చెల్లింపులు పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీఓ, అలాగే సర్పంచ్ లేదా ఎంపీపీ డిజిటల్ సంతకాలతోనే నిర్వహించాలని ఆ మెమోలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో అధికారుల వర్గాలు, మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ పూర్తిగా రద్దు చేశారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉప సర్పంచ్లలో ఆందోళన వ్యక్తమైంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రభుత్వం జారీ చేసిన మెమోలో ఉప సర్పంచ్ చెక్ పవర్‌ను పూర్తిగా తొలగించినట్లు ఎక్కడా పేర్కొనలేదని అధికారులు చెబుతున్నారు. కేవలం 15వ ఆర్థిక సంఘం నిధుల పారదర్శక వినియోగం, ఆన్‌లైన్ చెల్లింపుల సౌలభ్యం కోసం మాత్రమే డిజిటల్ సంతకాల విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. సంప్రదాయంగా కొనసాగుతున్న చెక్ విధానంలో ఉప సర్పంచ్ పాత్ర యథాతథంగానే ఉంటుందని స్పష్టతనిచ్చారు.

అందువల్ల ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దయ్యిందన్న వార్తలు అవాస్తవమని, అనవసర గందరగోళానికి తావివ్వకుండా అధికారిక ఉత్తర్వులను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు.

Latest articles

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం

గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల...

More like this

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...