💥హైదరాబాద్లో బాబ్రీ మెమోరియల్ నిర్మాణం ప్రకటించిన తెహ్రీక్ ముస్లిం షబ్బాన్
మన భారత్, న్యూఢిల్లీ | Babri Memorial | Hyderabad Political-Religious News
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో బాబ్రీ మసీదు తరహాలో నిర్మాణం చేపడతామని TMC సస్పెండెడ్ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ ప్రకటించిన నేపథ్యంలో, గ్రేటర్ హైదరాబాద్లో కూడా బాబ్రీ స్మారకం (Babri Memorial) ఏర్పాటు చేస్తామని ముస్లిం సంస్థ తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ అధికారికంగా ప్రకటించింది.
బాబ్రీ మసీదు కూల్చివేతకు 33 ఏళ్ల పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 6న జరిగిన బహిరంగ సభలో ఈ నిర్ణయాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు ముస్తాఖ్ మాలిక్ వెల్లడించారు. బాబ్రీ యానివర్శిటీతో పాటు రొటీన్ పబ్లిక్ మీటింగ్లో మెమోరియల్ నిర్మాణంపై ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు.
🔴 అన్ని సౌకర్యాలతో బాబ్రీ మెమోరియల్ నిర్మాణం
ముస్తాఖ్ మాలిక్ ప్రకారం..
* గ్రేటర్ హైదరాబాద్లో ప్రత్యేకమైన బాబ్రీ స్మారక స్థలాన్ని నిర్మించబోతున్నారని,
* ఆ మెమోరియల్లో అనేక సంక్షేమ కార్యకలాపాలు, సామాజిక సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని,
* నిర్మాణం స్థలం, విధానం, సమయంపై త్వరలో వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.
ఈ ప్రకటన రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
🔴 బాబ్రీ మసీదు వివాదం – పాత సమస్య, కొత్త ప్రకటనలు
1992లో అయోధ్యలో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చిన తర్వాత 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో రామమందిర నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అనంతరం అయోధ్యలో అద్భుత రామమందిరం నిర్మించి, ప్రధాని నరేంద్ర మోదీ దేవాలయ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.
అదే సమయంలో మసీదు తరహా నిర్మాణాలపై వచ్చిన తాజా ప్రకటనలు మళ్ళీ రాజకీయ రంగు పులుముకున్నాయి.
🔴 బెంగాల్లో బాబ్రీ తరహా కట్టడం – బీజేపీ ఆగ్రహం
శనివారం ముర్షీదాబాద్లో హుమయూన్ కబీర్ బాబ్రీ మసీదు తరహాలో కట్టడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే రోజు హైదరాబాద్లో బాబ్రీ మెమోరియల్ ప్రకటన రావడం రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారింది.
బీజేపీ దీనిపై ఘాటుగా స్పందిస్తూ..
* “బాబర్ పేరుతో కట్టడాలను పూర్తిగా వ్యతిరేకిస్తాం”
* “పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పోలరైజేషన్ రాజకీయాలకు తెరతీస్తోంది” అని విమర్శించింది.
అయితే హుమయూన్ కబీర్ బీజేపీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ,
* “మందిరం, చర్చి నిర్మించుకునే హక్కు ఎవరికైతే ఉందో… నాకు కూడా మసీదు నిర్మించుకునే హక్కు ఉంది” అన్నారు.
* రూ. 300 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపడతామని,
* ఆసుపత్రి, గెస్ట్ హౌస్, మీటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
