కూకట్పల్లిలో దారుణం… చెట్లకు నీళ్లు పోస్తున్న మున్సిపల్ కార్మికుడిని ఢీకొట్టిన కారు; ఘటన స్థలంలోనే మృతి
మన భారత్ , హైదరాబాద్: కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (కేపీఎచ్బీ)లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. చెట్లకు నీళ్లు పోస్తూ తన సేవల్ని నిర్వర్తిస్తున్న మున్సిపల్ కార్మికుడిని అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణం తీశింది.
అతి వేగమే ప్రమాదానికి కారణం
స్థానికుల ప్రకారం, అధిక వేగంతో దూసుకువచ్చిన కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుడిని బలంగా ఢీకొట్టింది. బలమైన ఢీకొట్టడంతో కార్మికుడు ఘటన స్థలంలోనే మరణించాడు.
డ్రైవర్ మద్యం మత్తులో.?
ప్రాథమిక సమాచారం ప్రకారం, కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు అక్కడ ఉన్న సాక్షులు తెలిపారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
పోలీసుల విచారణ కొనసాగుతోంది
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలు, డ్రైవర్ మత్తులో ఉన్నాడా అన్న అంశాలపై పోలీసు బృందం వివరాలు సేకరిస్తోంది.
ఈ ఘటనతో కూకట్పల్లి ప్రాంతంలో తీవ్ర విచారం నెలకొంది. రోడ్డు భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది.
