దారుణం… గర్భిణికి నిప్పంటించిన భర్త.!

Published on

-Advertisement-

కేరళలో దారుణం… గర్భిణిని నిప్పంటించిన భర్త!

మన భారత్ – క్రైమ్ డెస్క్,

కేరళ, మట్టుమల: రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తిన ఘోర ఘటన మట్టుమల ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. గర్భిణి మహిళ అర్చన మృతిపై మొదట ఆత్మహత్యగా అనుమానించిన పోలీసులు, దర్యాప్తు తర్వాత ఇది హత్యేనని తేల్చారు. కట్న వేధింపులు, ఇళ్లలో జరుగుతున్న హింస ఈ భయానక పరిణామానికి దారితీసిందని అర్చన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అర్చన మరణంపై ఆమె భర్త షారన్, అత్త రజిని, మరో కుటుంబ సభ్యుడిపై కేసు నమోదైంది. తొలుత అర్చన (గర్భవతి) ఆత్మహత్య చేసుకుందనే అభిప్రాయం వ్యక్తమైనా, పోలీసుల దర్యాప్తులో ఆమెను భర్త షారన్ తగలబెట్టినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. వెంటనే పోలీసులు షారన్ను అదుపులోకి తీసుకున్నారు.

కట్నం కోసం కొనసాగుతున్న వేధింపులు అర్చన జీవితాన్ని నాశనం చేశాయని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు కారుస్తున్నారు. అత్తింటి వేధింపులకే అర్చన బలైందని వారు ఆరోపించారు. కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

More like this

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...