భార్యపై దాడి…పరిస్థితి విషమం

Published on

-Advertisement-

భార్యపై దాడి…పరిస్థితి విషమం

మన భారత్, తాంసి, నవంబర్ 23 : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామంలో మద్యం మత్తులో జరిగిన ఘోర సంఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం ఆదివారం కప్పర్ల గ్రామానికి చెందిన మల్లెల నరేష్, మద్యం మత్తులో తన భార్య లావణ్యతో ఘర్షణకు దిగాడు.ఇటివల భార్య పిర్యాదుతో డవు సెంటర్ కు తరలించగా మళ్ళీ తిరిగి నెల రోజుల తరువాత ఇంటికి వచ్చాడు.దింతో భార్య పై కోపంతో ఇనుప పట్టితో భార్య తలపై అతికిరాతకంగా దాడి చేసినట్లు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న లావణ్యను గమనించిన కుటుంబీకులు వెంటనే ఆదిలాబాద్‌ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు గుర్తించి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదు కు రెఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై లావణ్య తరుపున బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాంసి ఎస్సై జీవన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఈ ఘటన తీవ్రమైన ఆందోళనకు దారితీసింది.

Latest articles

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

మన భారత్ | న్యూఢిల్లీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన...

మీ-సేవ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

కూచులాపూర్‌లో మీ-సేవ కేంద్రం ప్రారంభం ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు, జూలై...

ప్రజల సహకారం అవసరం: ఎస్పీ అఖిల్ మహాజన్

ధనోర (బి), మన భారత్ గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం: ఎస్పీ...

తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్..

తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ -తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి మన భారత్,మొగుళ్ళపల్లి: మాజీ,ముఖ్యమంత్రి..తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర...

More like this

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

మన భారత్ | న్యూఢిల్లీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన...

మీ-సేవ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

కూచులాపూర్‌లో మీ-సేవ కేంద్రం ప్రారంభం ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు, జూలై...

ప్రజల సహకారం అవసరం: ఎస్పీ అఖిల్ మహాజన్

ధనోర (బి), మన భారత్ గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం: ఎస్పీ...