తెలంగాణలో కోటి మహిళలకు “కోటి” చీరలు:

Published on

తెలంగాణలో కోటి మహిళలకు కోటి చీరలు: రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిన భారీ సంకల్పం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డను గౌరవించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కోటి మహిళలకు–కోటి చీరలు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె విగ్రహానికి పుష్పాంజలి అర్పించిన అనంతరం, పలు మహిళా సమాఖ్య ప్రతినిధులకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మహిళలకు చీరల పంపిణీని అధికారికంగా ప్రారంభించారు.

చీరల పంపిణీ షెడ్యూల్:

  • మొదటి విడతలో డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు పంపిణీ
  • మార్చి 1 నుంచి 8 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ, మున్సిపల్ ప్రాంతాల్లో పంపిణీ

మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను గుర్తుచేస్తూ, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, జీరో వడ్డీ రుణాలు, పెట్రోల్ బంక్‌ల కేటాయింపు, ₹500కు గ్యాస్ సిలిండర్‌, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, బస్సులకు మహిళలను యజమానులుగా నిలపడం వంటి నిర్ణయాలను వివరించారు. త్వరలో మహిళలకు సోలార్ పవర్ ప్లాంట్లు అందించే ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఇందిరా గాంధీ బడుగు, బలహీన వర్గాల కోసం తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొంటూ, చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. “ప్రతి ఆడబిడ్డకు చీర అందుతుంది… ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఇది గౌరవ సూచక కార్యక్రమం” అని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ధనసరి అనసూయ సీతక్క , దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వాకిటి శ్రీహరి మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Latest articles

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

More like this

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....