మటన్ బోన్ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

Published on

-Advertisement-

🍖 దావత్లో విషాదం… మటన్ బోన్ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి. నూతన ఇల్లు వేడుక దుఃఖంలో ముగిసింది

మన భారత్‌, నాగర్‌కర్నూల్‌,:  నూతన గృహ నిర్మాణ వేడుక ఆనందాన్ని కాసేపట్లోనే దుఃఖంలో ముంచెత్తిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బొందలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన ఓ కుటుంబం మేస్త్రీల కోసం ఏర్పాటు చేసిన దావత్లో ఈ విషాదం సంభవించింది.

స్థానికుల సమాచారం ప్రకారం, మేస్త్రీలలో ఒకరైన పోలేముని లక్ష్మయ్య (45) భోజనం చేస్తూ మటన్ ముక్కలోని ఎముక గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కుప్పకూలిపోయాడు. వెంటనే సహచరులు అతడిని సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest articles

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...

తెలంగాణ సాధనలో యువత త్యాగాలు చిరస్మరణీయం

పల్లి (బి) గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరవీరులకు నివాళులు అర్పించిన గ్రామ ప్రజలు మన భారత్,...

More like this

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...