20.76 శాతం పోలింగ్ నమోదు..

Published on

📰 Generate e-Paper Clip

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్న పోలింగ్

 

హైదరాబాద్, నవంబర్ 11: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రారంభం నుండి పోలింగ్ సజావుగా కొనసాగుతుండగా, ఎక్కడా పెద్దగా అవాంఛనీయ ఘటనలు జరగలేదు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు. కొద్ది సేపటికి షేక్‌పేట పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించిందని, కానీ టెక్నికల్ బృందం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిందని చెప్పారు.

మొత్తం 6 పోలింగ్ కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలను యుద్ధప్రాతిపదికన సరి చేయడం జరిగింది. ఎలాంటి అంతరాయం లేకుండా పోలింగ్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈసారి గత ఎన్నికలతో పోలిస్తే 40 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదైందని ఆర్వీ కర్ణన్ తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయి. ఎక్కడైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండి పహారా కాస్తున్నారు. ఎన్నికల అధికారులు ఓటర్లను శాంతంగా, క్రమశిక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Latest articles

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

More like this

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...