ఎకరాకు రూ.10 వేలు కాదు.. రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి: కవిత

Published on

-Advertisement-

మత్తడి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ – కల్వల మత్తడి వద్ద రైతుల బాధలు తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు

మన భారత్, కరీంనగర్, అక్టోబర్ 31: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైతుల తరపున బలమైన స్వరం వినిపించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి వద్ద భారీ వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఆమె, రైతుల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..“రైతులు ఎకరాకు రూ. 10 వేలు కాకుండా ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించాలి” అని కవిత డిమాండ్ చేశారు.

మూడు సంవత్సరాల క్రితం కల్వల మత్తడి కొట్టుకుపోయిందని, దానిని మరమ్మతు చేసేందుకు అప్పటి ప్రభుత్వం రూ. 70 కోట్లు విడుదల చేస్తూ జీవో కూడా ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం మారిన తరువాత ఆ పనులు నిలిచిపోయాయని విచారం వ్యక్తం చేశారు. హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కలిసి ఈ మత్తడి పునరుద్ధరణకు కృషి చేయాలని ఆమె కోరారు.

6 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ వల్ల వందలాది రైతు కుటుంబాలు బతుకుతుంటే, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈరోజు అవి కష్టాల్లో కూరుకుపోయాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రైతులందరూ తీవ్ర నష్టాన్ని చవిచూశారని, కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్, ఖమ్మం జిల్లాలకు మాత్రమే పరిహారం ప్రకటించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “శంకరపట్నం రైతులు కూడా వరి పంటలు కోతకు సిద్ధం అయ్యే సమయంలో పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వం వీరిని కూడా గుర్తించాలి” అని అన్నారు.

“పంట చేతికొచ్చిన రైతులు ఇప్పుడు 25 శాతం దిగుబడికే పరిమితమయ్యారు. ఇది బాధాకరం. ప్రభుత్వం రైతుల పట్ల మానవతా దృక్పథంతో స్పందించాలి,” అని కవిత హితవు పలికారు.

జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఫీల్డ్ అధికారుల ద్వారా పంట నష్టం లెక్కలు తీయాలని సూచించిన ఆమె, కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్రం తరఫున రైతులకు పరిహారం పొందేందుకు ప్రయత్నించాలన్నారు.

అటు కల్వల మత్తడి రిపేర్ పనులు ఆలస్యం కాకుండా వెంటనే పూర్తి చేయాలని ఆమె ప్రభుత్వం, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై ఆధారపడి ఉన్న దాదాపు 180 ముదిరాజ్ కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోకుండా కాపాడాలని కవిత కోరారు.

“రైతు లేనిదే రాజ్యం లేదు. ఆ మాటకు అర్ధం ఇవ్వాలంటే రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి,” అంటూ కవిత తన పర్యటనను ముగించారు.

Latest articles

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

More like this

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...