ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Published on

📰 Generate e-Paper Clip

మొంథా తుఫాను ప్రభావం: పొంగుతున్న వాగుల వైపు వెళ్లవద్దని హెచ్చరిక – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుగులోత్ భావుసింగ్ నాయక్ సూచన

మన భారత్, ఖమ్మం: మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్ సొసైటీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి వైపు వెళ్లకూడదని హెచ్చరించారు. భావుసింగ్ నాయక్ మాట్లాడుతూ, “వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాగులు పొంగిపొర్లే ప్రమాదం ఉంది. ప్రజలు కుతూహలంతో లేదా చేపల వేట కోసం వాగుల దగ్గరికి వెళ్లడం చాలా ప్రమాదకరం. వర్షాలు తగ్గేవరకు ఇంటి వద్దే సురక్షితంగా ఉండండి” అని సూచించారు. అలాగే ఆయన జిల్లా అధికారులను కూడా అప్రమత్తం చేయడంతో పాటు, పొంగే వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని, పిల్లలను నీటిముంపు ప్రాంతాల నుండి దూరంగా ఉంచాలని సూచించారు.

తుఫాను ప్రభావం కారణంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే పలు తక్కువ ఎత్తులోని ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉందని, ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Latest articles

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

More like this

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...