శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్
-చిట్యాల సిఐ వై.సతీష్
మన భారత్,మొగుళ్ళపల్లి:
శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చిట్యాల సిఐ వై.సతీష్ అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో కార్డెన్ సర్చ్ నిర్వహించి ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి, ఎవరు కూడా ఆపరిచిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వరాదని సూచించారు. అనంతరం నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలకు అక్కడికక్కడే జరిమానా విధించారు. అలాగే సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు.
సైబర్ క్రైమ్ ,గంజాయి, నియంత్రణ సీసీ కెమెరాల, ప్రాముఖ్యత ,ట్రాఫిక్ రూల్స్, కొత్త చట్టాలపై అవగాహన మూఢనమ్మకాల గురించి స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మొగుళ్ళపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్, టేకుమట్ల ఎస్ ఐ,అమూల్య, ఇస్సిపేట సర్పంచ్ యార ముకుందా రెడ్డి,పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
