నాలుగు ఏళ్ళు గడిచిన నిర్మాణం పూర్తి అయ్యేనా.?

Published on

-Advertisement-

అసంపూర్తిగా గ్రామ పంచాయతీ భవనం

వెంటనే నిధులు మంజూరు చేయాలి

నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి: సర్పంచ్ సిడం శైలజ రవి

మన భారత్, తలమడుగు:

మండలంలోని కోసాయి గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని గ్రామ సర్పంచ్ సిడం శైలజ రవి డిమాండ్ చేశారు. కోసాయి గ్రామం తలమడుగు మండల పరిధిలోని గ్రామ పంచాయతీగా కొనసాగుతోంది.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం నాలుగేళ్లుగా పూర్తికాకుండా నిలిచిపోయిందన్నారు. భవనం అసంపూర్తిగా ఉండటంతో గ్రామస్థులకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం పాత గ్రామ పంచాయతీ భవనంలోనే పరిపాలనా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త భవన నిర్మాణం త్వరగా పూర్తి కావాల్సిన అవసరం ఉందన్నారు.

అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. గ్రామ అభివృద్ధికి కీలకమైన పంచాయతీ భవనం పూర్తయితే ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సిడం శైలజ రవి విజ్ఞప్తి చేశారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

మన భారత్,జూలై 20 ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి...

గుడుంబా అక్రమ మద్యం స్వాధీనం..

మన భారత్, ఆదిలాబాద్ 14 ద్విచక్ర వాహనాలు సీజ్ ఆదిలాబాద్, జూలై 20:ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నిర్మూలన...

More like this

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

మన భారత్,జూలై 20 ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి...