ఆ మహానీయుల సేవలు మరువలేనివి..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్‌లోని జిల్లా వయోవృద్ధుల సమైక్య కార్యాలయంలో సోమవారం వన్నెల ఎల్లన్న జయంతి మరియు మద్ది రామచందర్ 26వ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం , ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వన్నెల ఎల్లన్న , మద్ది రామచందర్ గారు తమ జీవితాలను సమాజ సేవకు అంకితం చేసిన మహనీయులని పేర్కొన్నారు. ముఖ్యంగా వన్నెల ఎల్లన్న రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడుతూ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు. కులాలకు అతీతంగా సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.

అలాగే మద్ది రామచందర్ ఆదివాసి నాయకపోడ్ సమాజ అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన నాయకుడని, ఆయన సేవలను నేటి తరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమాజ అభివృద్ధి కోసం పని చేసిన నాయకులను ప్రతి సంవత్సరం స్మరించుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో పల్ల సత్యనారాయణ, పెళ్లి శ్రీనివాస్, సిద్దుల సత్యనారాయణ, తమ్మల గంగన్న తదితరులు పాల్గొన్నారు. వారు నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సమాజ అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుల ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సాగు భూములకు దారి కల్పించాలని తహసీల్దార్‌కు వినతి

మన భారత్, తలమడుగు: 1995లో ప్రభుత్వం కేటాయించిన భూములకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు తలమడుగు: మండల పరిధిలోని కజ్జర్ల శివారులో ప్రభుత్వం...

మిర్యాలగూడలో విషాదం.. సిలిండర్ పేలుడుతో ముగ్గురు సజీవ దహనం

మన భారత్, నల్గొండ: అమ్మమ్మ, మనవడు, మనవరాలు మృతి – షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో...

రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు

మన భారత్, తాంసి జొన్న కొనుగోళ్లలో జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన లీడర్ కృష్ణ రత్న ప్రకాష్ తాంసి మండల కేంద్రంలోని...

ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ..

మన భారత్, బొండపల్లి: బొండపల్లి, గజపతినగరం, మెంటాడ మండలాల నుంచి పాల్గొన్న 170 మంది ఉపాధ్యాయులు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం...

More like this

సాగు భూములకు దారి కల్పించాలని తహసీల్దార్‌కు వినతి

మన భారత్, తలమడుగు: 1995లో ప్రభుత్వం కేటాయించిన భూములకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు తలమడుగు: మండల పరిధిలోని కజ్జర్ల శివారులో ప్రభుత్వం...

మిర్యాలగూడలో విషాదం.. సిలిండర్ పేలుడుతో ముగ్గురు సజీవ దహనం

మన భారత్, నల్గొండ: అమ్మమ్మ, మనవడు, మనవరాలు మృతి – షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో...

రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు

మన భారత్, తాంసి జొన్న కొనుగోళ్లలో జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన లీడర్ కృష్ణ రత్న ప్రకాష్ తాంసి మండల కేంద్రంలోని...