ఆ గ్రామంలో VDC నిధులపై వివాదం..!

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ :

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కేలో గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) నిధుల వినియోగంపై వివాదం చెలరేగింది. గతంలో ఏర్పాటైన కమిటీలో ఛైర్మన్‌గా పనిచేసిన సుభాష్‌పై నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం ప్రకారం, VDC ఖాతాలో సుమారు రూ.1.30 కోట్ల నిధులు జమ అయ్యాయి. ఈ నిధుల్లో కొంత మొత్తాన్ని గ్రామ అభివృద్ధి పనులకు వినియోగించినట్లు చెప్పబడుతున్నప్పటికీ, మిగిలిన నిధుల వినియోగంపై స్పష్టత లేకపోవడంతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఛైర్మన్ వివరణ కోరారు. ఈ క్రమంలో పాత, కొత్త కమిటీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, ప్రతి సంవత్సరం సుమారు రూ.30 లక్షల చొప్పున నిధులను మాజీ ఛైర్మన్ సుభాష్ స్వయంగా వినియోగించుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిధుల లావాదేవీలపై పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించి వాస్తవాలు వెలికితీయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వివాదంపై అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, నిధుల వినియోగంలో పారదర్శకత తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అవసరమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులపై వివాదం తలెత్తడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపించి గ్రామంలో శాంతి, సౌహార్ద వాతావరణం నెలకొల్పాలని స్థానికులు కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

అక్కను వదిలి.. చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

మన భారత్, గద్వాల: బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన ఒక మైనర్ బాలిక జీవితాన్ని...

దళిత రత్న పురస్కార గ్రహీతకు అభినందనలు

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దళితుల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తున్న అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా...

రూ.7 కోట్ల సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి..

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’లో భాగంగా భారీ సైబర్ మోసం కేసు బయటపడింది....

అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభం..

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అటవీ ఉత్పత్తుల కొనుగోలు...

More like this

అక్కను వదిలి.. చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

మన భారత్, గద్వాల: బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన ఒక మైనర్ బాలిక జీవితాన్ని...

దళిత రత్న పురస్కార గ్రహీతకు అభినందనలు

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దళితుల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తున్న అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా...

రూ.7 కోట్ల సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి..

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’లో భాగంగా భారీ సైబర్ మోసం కేసు బయటపడింది....