కలెక్టర్ సభలో కరెంట్ అంతరాయం..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు :
తాంసి మండలంలోని పొన్నారి గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన “మోదుగ మొగ్గలు” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అనూహ్యంగా కరెంట్ నిలిచిపోవడం కొంతసేపు అంతరాయం కలిగించింది. అయినప్పటికీ నిర్వాహకులు బ్యాటరీ మైక్ సాయంతో కార్యక్రమాన్ని కొనసాగించడం విశేషం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని “మోదుగ మొగ్గలు” పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కరెంట్ నిలిచిపోవడంతో కొంతసేపు కార్యక్రమం అంతరాయం కలిగినప్పటికీ, నిర్వాహకులు చురుకుగా స్పందించి బ్యాటరీ మైక్ ద్వారా సభను కొనసాగించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నప్పటి నుంచే రచనా ప్రతిభను పెంపొందించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. సృజనాత్మకతతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించవచ్చని సూచించారు.

తరువాత బండల్ నాగపూర్ మహాత్మ జ్యోతిబా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది కలెక్టర్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి ఉదారి నారాయణ, ఎంపీడీవో మోహన్ రెడ్డి, ఎమ్మార్వో లక్షీ, ఎంఈవో శ్రీకాంత్, ఎపీఎం భగవాండ్లు, సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ రాంరెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి….

మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని దివ్యాంగుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు 2016 చట్టం ప్రకారం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు...

భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

ఆటో బోల్తా .. ఒకరి మృతి

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

More like this

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి….

మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని దివ్యాంగుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు 2016 చట్టం ప్రకారం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు...

భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

ఆటో బోల్తా .. ఒకరి మృతి

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...