మన భారత్, తలమడుగు:
రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోండ్ల మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య ప్రాముఖ్యతను పెంపొందించడానికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని తెలిపారు. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
“అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి” అని సర్పంచ్ బోండ్ల మహేందర్ పిలుపునిచ్చారు. గ్రామస్థులు, యువత ముఖ్యంగా ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, యువకులు పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి.
