మన భారత్, తలమడుగు (ఆసిఫాబాద్):
ఆసిఫాబాద్ జిల్లాలో బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించాలని, బుద్ధ పూజారులకు గౌరవ వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ యువజన సంఘం , భారతీయ బౌద్ధ మహా సభ ప్రతినిధులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వాంకీడి మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, బుద్ధ పూర్ణిమ బౌద్ధుల ప్రధాన పండుగగా దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్థాయిలో అధికారిక సెలవు ప్రకటించడం ద్వారా బౌద్ధ సమాజానికి గౌరవం ఇవ్వాలని కోరారు.
అలాగే బుద్ధ పూజారులు సమాజంలో ధార్మిక, సాంస్కృతిక సేవలు అందిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు లేకపోవడం బాధాకరమని తెలిపారు. అందువల్ల వారికి గౌరవ వేతనం అందించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వినతిపత్రాన్ని స్వీకరించిన అధికారులకు సమస్యలపై సమగ్ర వివరణ ఇచ్చిన సంఘాల ప్రతినిధులు, తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు, బౌద్ధ మహాసభ సభ్యులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
