మన భారత్, అంతర్జాతీయ వ్యాపార వార్తలు:
ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం Meta Platforms మరోసారి ఉద్యోగుల తొలగింపులపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంస్థలో సుమారు 700 మంది ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులను ఉటంకిస్తూ The New York Times కథనం ప్రచురించింది. సంస్థలో పునర్వ్యవస్థీకరణ (restructuring) చర్యలలో భాగంగా ఈ ఉద్యోగాల కోతలు చేపట్టినట్లు సమాచారం. వ్యయ నియంత్రణ, సంస్థ పనితీరు మెరుగుదల లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఉద్యోగుల తొలగింపుకు ఒకరోజు ముందే కంపెనీ ఆరుగురు ఎగ్జిక్యూటివ్లకు భారీగా కాంపన్సేషన్ పెంపు ప్రకటించిందన్న విషయం మరింత చర్చనీయాంశమైంది. మొత్తం 921 మిలియన్ డాలర్ల మేర కాంపన్సేషన్ పెంపు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఒకవైపు ఉద్యోగుల తొలగింపులు, మరోవైపు ఉన్నతాధికారులకు భారీ పారితోషికాలు ఇవ్వడం కంపెనీ విధానాలపై విమర్శలకు దారితీస్తోంది. ఉద్యోగ భద్రతపై టెక్ రంగంలో ఆందోళనలు పెరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా టెక్ సంస్థలు ఆర్థిక ఒత్తిళ్లు, మార్కెట్ పరిస్థితుల కారణంగా ఉద్యోగాల కోతలకు దిగుతున్న నేపథ్యంలో, మెటా తీసుకున్న తాజా నిర్ణయం ఐటీ రంగంలో మరోసారి చర్చనీయాంశమైంది.

