పుకార్లతో పెట్రోల్ బంక్ వద్ద రద్దీ.!

Published on

-Advertisement-

మన భారత్: తలమడుగు:

ఇందన కొరతపై వ్యాపిస్తున్న పుకార్ల నేపథ్యంలో వాహనదారులు గందరగోళానికి గురై పెట్రోల్ బంక్‌ల వద్ద భారీగా చేరుకున్నారు. బుధవారం తలమడుగు మండలం సుంకిడి గ్రామం సమీపంలోని మహారాష్ట్ర అంతరాష్ట్ర రహదారిపై ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఈ పరిస్థితి నెలకొంది.

పుకార్ల ప్రభావంతో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ కోసం ఎగబడి బంక్ వద్ద రద్దీ సృష్టించారు. చాలా మంది తమ వాహనాల్లో అవసరానికి మించిన పెట్రోల్ నింపించుకోవడంతో పాటు, కాలి డబ్బాల్లో కూడా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ మేనేజర్ మాట్లాడుతూ, ప్రాంతంలో ఎలాంటి పెట్రోల్ కొరత లేదని స్పష్టం చేశారు. కొందరు అసత్య ప్రచారం చేయడంతో ప్రజల్లో భయం నెలకొని, అనవసరంగా బంక్ వద్ద రద్దీ పెరిగిందని తెలిపారు.

అధికారులు కూడా ప్రజలు పుకార్లను నమ్మకుండా, అవసరానికి తగ్గట్టే ఇందనాన్ని వినియోగించాలని సూచిస్తున్నారు. ఎటువంటి కొరత లేదని, సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని భరోసా ఇచ్చారు.

ఈ ఘటనతో తలమడుగు ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...